రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ

- రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇళ్లు, రేషన్ కార్డుల అంశంపై లేఖ
- అర్హులందరికీ పథకాలు అందకపోవడం దారుణమని వ్యాఖ్య
- ఇచ్చిన వాగ్ధానాలలో ఒక్కటీ అమలు కాలేదన్న బండి సంజయ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇళ్లు, రేషన్ కార్డుల అంశంపై ఈ లేఖ రాశారు. అర్హులందరికీ పథకాలు అందకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 70 లక్షల మంది రైతులు ఉంటే, ఇప్పటి వరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.